నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు ఏపీలో 1:100 పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తామని, అసెంబ్లీని స్తంభింపచేస్తామని హెచ్చరించారు.