జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూఢం సమయంలో గురు, శుక్ర గ్రహాలు బలహీనమవుతాయి. ఆ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే కలిసి రాదని, అశుభం వినాల్సి రావొచ్చని వేద పండితులు చెబుతున్నారు. ఏదైనా కష్టం కలగొచ్చని, ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అందుకే మూఢం సమయంలో ఏ శుభకార్యమూ తలపెట్టకూడదని అంటుంటారు.