టైటానిక్ ప్రమాదంలో మరణించిన అత్యంత సంపన్న వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ (47)కు చెందిన గోల్డ్ పాకెట్ వాచ్ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ ఇటీవల నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఈ నౌక మునిగిపోతున్నపుడు ఓ ప్యాసింజర్ వాయించిన వయొలిన్కు అప్పట్లో 1.1 మిలియన్ పౌండ్లు రికార్డుస్థాయి ధర పలికింది.