రూ.12 కోట్లు పలికిన టైటానిక్‌ వాచ్‌

51చూసినవారు
రూ.12 కోట్లు పలికిన టైటానిక్‌ వాచ్‌
టైటానిక్‌ ప్రమాదంలో మరణించిన అత్యంత సంపన్న వ్యాపారవేత్త జాన్‌ జాకబ్‌ ఆస్టర్‌ (47)కు చెందిన గోల్డ్‌ పాకెట్‌ వాచ్‌ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్‌ అండ్‌ సన్‌ వేలం సంస్థ ఇటీవల నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఈ నౌక మునిగిపోతున్నపుడు ఓ ప్యాసింజర్‌ వాయించిన వయొలిన్‌కు అప్పట్లో 1.1 మిలియన్‌ పౌండ్లు రికార్డుస్థాయి ధర పలికింది.

సంబంధిత పోస్ట్