రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 388 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్విన్ 25, ధృవ్ జురెల్ 31 క్రీజులో ఉన్నారు. రెండో రోజు తొలి సెషన్ ఆరంభమైన కాసేపటికే కుల్దీప్ 4, జడేజా 112 వెనువెంటనే ఔటయ్యారు.