డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ

122807చూసినవారు
డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ
ఏపీ ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది శ్రవణ్ కుమార్ తీసుకెళ్లారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వల్ల డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది.

సంబంధిత పోస్ట్