భారత మహిళా షట్లర్లు సంచలన విజయం

69చూసినవారు
భారత మహిళా షట్లర్లు సంచలన విజయం
మలేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు శుక్రవారం సంచలన విజయాన్ని సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో హాంకాంగ్‌ను 3-0తో చిత్తు చేసింది. హాంకాంగ్‌కు చెందిన సిన్ యాన్ హ్యాపీను సింధు 21-7, 16-21, 21-12తో ఓడించింది. డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జోడీ గెలవడంతో ఆధిక్యం 2-0కి పెరిగింది. అశ్మిత 21-12, 21-13తో యెంగ్ సమ్ యీపై గెలవడంతో భారత్‌కు పతకం ఖాయమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్