ఎలాంటి వివాదం లేని భూములను టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసి, వివాదాల్లో ఉన్న భూమి వివరాలను ఓ ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఆ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం కల్పిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అవుతుంది.