తనను కొందరు ట్రోల్స్ చేయడం చూసి బాధేసేదని నటి మంచు లక్ష్మీ తెలిపారు. "నాది మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడేతత్వం. పొలిటికల్గా మాట్లాడడం రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. కొందరికి నచ్చుతుంది.. మరికొందరికి నచ్చదు. నచ్చినవాళ్లు అభిమానిస్తారు. నచ్చని వారిలో కొందరు ట్రోల్స్ చేస్తారు." అని లక్ష్మీ పేర్కొన్నారు. తాను నటించిన 'యక్షిణి' వెబ్సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆమె ఈ మేరకు మాట్లాడారు.