సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో మూవీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ తాజాగా అప్డేట్ అందించారు. జూన్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభిస్తామని లోకేశ్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రజనీ సినిమా తర్వాత 'ఖైదీ-2' సినిమాను మొదలు పెడతానని పేర్కొన్నారు.