జర్నలిస్టులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ గుడ్న్యూస్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్పందించారు. ఇళ్ల స్థలాల కేటాయింపుపై క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్కార్డు ఉన్న చోటే స్థలం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.