మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో హోదాలో ఓటరుగా సీఎం రేవంత్రెడ్డి పేరు నమోదైంది. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు తుది జాబితాను వికారాబాద్ జిల్లా కొడంగల్ తహసీల్దారు విజయకుమార్ విడుదల చేశారు. కొడంగల్ మన్సిపల్ పరిధి నుంచి రేవంత్రెడ్డి పేరు నమోదు చేసుకున్నట్లుగా వెల్లడించారు. కాగా ఈ నెల 28న ఉప ఎన్నిక జరగనుంది.