మహారాష్ట్రలోని కింగ్ ఎడ్వర్డ్ అసుపత్రిలో 1967లో అరుణా షాన్బాగ్(25) నర్సుగా చేరారు. నవంబర్ 27, 1973 లో ఆమె ఓ గదిలో బట్టలు మార్చుకుంటుండగా సోహన్లాల్ అనే వార్డుబాయ్ చేతిలో పాశవిక దాడికి గురయ్యారు. ఈ లైంగిక దాడిలో ఆమె మెదడుకు తీవ్ర గాయమైంది. 42 ఏళ్ల పాటు ఆమె అచేతన స్థితి(కోమా)లో ఉండిపోయింది. 2015లో ఆమె తుది శ్వాస విడిచింది. ఈ ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇవాళ కోర్టులో సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆమె ప్రస్తావన తెచ్చిన విషయం తెలిసిందే.