ప్రస్తుతం వేసవికాలం ప్రారంభంకావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాడగాల్పులు వీచే అవకాశం ఉంది. కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కనీసం 30 డిగ్రీల సెల్సియస్, అదే కోస్తా ప్రాంతంలో 37 డిగ్రీలు మరియు మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటితే వడ గాల్పులు వీస్తాయి. ఓ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల ఉష్ణోగ్రత 45 డిగ్రీలు కొనసాగితే ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ’ మార్గదర్శకాల ప్రకారం నివారణ చర్యలు తీసుకోవాలి.