న్యాయం జరిగేంతవరకు పోరాడతా: మందకృష్ణ మాదిగ

74చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మాదిగల తరపున మాట్లాడితే.. మాలలు ఎక్కడ తిరుగబడతారోనని ఆయనకు భయం పట్టుకుందని దుయ్యబట్టారు. ఒకవేళ సీఎం పదవి నుంచి రేవంత్ దిగిపోతే.. తాను సీఎం అవ్వాలని భట్టి విక్రమార్క భీష్మించుకు కూర్చున్నారని ఎద్దేవా చేశారు. మాదిగలకు న్యాయం జరిగేంతవరకు తాను పోరాడతానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్