ప్రపంచానికి
భారత్ అవసరమని, దానికి అనుగుణంగా దేశం ఎదగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్రలోని పూణె జిల్లా అలండిలో జరిగిన గీతా భక్తి అమృత్ మహోత్సవంలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన బాలరాముడికి ప్రాణప్రతిష్ట చేయడం సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు.
భారత్ ఇంకా ఎదగాలని, ఒకవేళ ఎదగలేకపోతే భూలోకం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.