రాజస్థాన్లోని పాలి జిల్లాలోని జదన్ గ్రామంలో అద్భుతమైన 'ఓం' ఆకారంలో శివాలయాన్ని నిర్మిస్తున్నారు. 1995 ఈ ఆలయాని శంకుస్థాపన చేయగా.. ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 250 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న ఈ శివాలయం నాగరా శైలి వాస్తుశిల్పం, ఉత్తర భారత వాస్తుశిల్పం ఆధారంగా నిర్మించబడుతోంది. ఓం ఆకారం దాదాపు అర కిలోమీటరు వ్యాసార్థంలో వ్యాపించి ఉంటుంది.