ఉండవల్లిలోని
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై వీరు మరోసారి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి? ఏయే నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.