పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్ అయిన కుష్బూ గుప్తా తన ఇండిగో విమానంలో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్ళింది. ఈ సమయంలో ఒక ఇబ్బందికరమైన సంఘటనను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు తెలిపింది. డిసెంబర్ 29 ఉదయం, గుప్తా తన విమాన టిక్కెట్తో పాటు ముందుగా శాండ్విచ్ని బుక్ చేసుకుంటే దానిలో సజీవంగా పురుగులు కనిపించాయి. దీంతో ఆమె నిరాశ చెంది యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.