హర్యానా ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా

69చూసినవారు
హర్యానా ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా
భారత రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ లు బుధవారం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ అవుతోంది. అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రెజ్లర్లు రాహుల్ గాంధీతో సమావేశమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతకు ముందు, పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగొచ్చిన తర్వాత వినేశ్ హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాను కలిసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్