యాదాద్రి భక్తుల సౌకర్యాలు అడిగి తెలుసుకున్న ఈవో

73చూసినవారు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఆలయ ఈవో భాస్కరరావు ఆదివారం భక్తులతో ముచ్చటించారు. ప్రత్యేక దర్శనం, ధర్మ దర్శనం క్యూ లైన్లో స్వయంగా తిరిగి దేవస్థాన సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల రద్దీ, వేసవికాలం దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక షెడ్లు, చలవ పందిళ్లు, కూలర్లు, మంచినీళ్ల సౌకర్యం ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్