వైసీపీలో చేరిన జనసేన కీల‌క నేత‌లు

412512చూసినవారు
ఎన్నికల వేళ జ‌న‌సేనకు షాక్‌ తగిలింది. తాజాగా కొందరు జనసేన కీలక నేతలు వైసీపీలో చేరారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం వద్ద సీఎం జ‌గ‌న్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో జనసేన సీనియర్ నేత గంపల గిరిధర్, ఎన్‌. శ్రీనివాస్‌, జి. శ్రీజ, జి. ధనుష్, విద్యావేత్త అలీవర్ రాజు రాయ్ ఉన్నారు. 2019లో జనసేన తరపున విశాఖ సౌత్ నుంచి గిరిధర్ పోటీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్