ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్లను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ విపక్ష ఇండియా కూటమి రాంచీలో మెగా ర్యాలీ నిర్వహించనుంది. ఉలుగులన్ న్యాయ్ ర్యాలీ పేరిట జరిగే ఈ ర్యాలీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సహా 14 మంది విపక్ష నేతలు హాజరుకానున్నారు.