May 06, 2024, 11:05 IST/ఆలేరు నియోజకవర్గం
ఆలేరు నియోజకవర్గం
కేంద్రమంత్రి అమిత్ షా మీటింగ్ కు తరలిరావాలి: పాశం భాస్కర్
May 06, 2024, 11:05 IST
ఈనెల 9న భువనగిరి మున్సిపాలిటీ రాయగిరిలో నిర్వహించబోయే బిజెపి భారీ బహిరంగ సభకు భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరిలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముందుగా సభాస్తలాన్ని పరిశీలించారు.