యాసంగికీ భరోసాలేదు;

68చూసినవారు
యాసంగికీ భరోసాలేదు;
15 రోజుల్లో ఇవ్వాల్సిన నివేదిక నాలుగు నెలలైనా పత్తా లేదు. ఎప్పు డు ఇస్తుందో కూడా తెలియదు. అతీ గతీ లేని నివేదికతో రైతు భరోసా పంపిణీకి లింకు పెట్టారు. రైతు భరోసాపై మంత్రుల కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు. దీంతో ఆ నివేదిక ఇచ్చేదెప్పుడు.. రైతుభరోసా వచ్చేదెప్పుడు అనే ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. కమిటీ నివేదిక సాకుతో యాసంగి కూడా రాం రాం పలికే కుట్ర చేస్తుందేమో అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్