గుజరాత్లోని జునాగఢ్లో షాకింగ్ ఘటన జరిగింది. విశావదర్ ప్రాంతంలో 11వ తరగతి చదువుతున్న సగిర అనే బాలికతో జై సుఖానంది అనే యువకుడు కొన్నాళ్లుగా వాట్సాప్ చాట్ చేస్తున్నాడు. తనను ప్రేమించాలని ఆ యువకుడు కోరగా బాలిక తిరస్కరించింది. దీంతో మరో స్నేహితుడి సాయంతో బాలికను కారులో కిడ్నాప్ చేశాడు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి బాలికను రక్షించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.