ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పరిషత్ కార్యాలయం సమీపంలో జరిగింది. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఫుట్బోర్డుపై నించున్న యువతి కిందపడిపోయింది. బస్సులోంచి జారిపడిన అనుషపై నుంచి వెనుక టైరు వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయింది.