ఇటీవల రైళ్లలో ప్రయాణికులు తోటి వారితో గొడవలకు దిగడం సాధారణం అయింది. అలాంటి ఘటనే అజిమ్గంజ్-కవిగురు ఎక్స్ప్రెస్ రైలులో జరిగింది. సీట్ విషయమై ఇద్దరు యువతులు ఓ యువకుడితో గోడవ పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువతులు ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఆ వ్యక్తి వారిపై దాడికి దిగాడు. తోటి ప్రయాణికులు కల్పించుకొని వారికి సర్ది చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.