AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 79.40 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇవాళ సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని చెప్పారు. మొత్తంగా 81 శాతం పోలింగ్ నమోదు కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారని వివరించారు.