అల్లు అర్జున్ పర్యటన.. కానిస్టేబుళ్లపై వేటు

నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదానికి సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజుల‌ను వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న త‌న సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. ఈ క్ర‌మంలో భారీ జన సమీకరణ జరుగుతుందనే సమాచారం అందివ్వలేదనే కానిస్టేబుళ్లపై చర్యల‌కు ఉప‌క్ర‌మించారు.

సంబంధిత పోస్ట్