లోక్సభ ఎన్నికల్లో ఇవాళ ఆరో విడుత పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. ప్రతి ఓటు విలువైనదని, మీ ఓటును కూడా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. భారీ సంఖ్యలో ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల సరళిలో ప్రజలు చైతన్యవంతంగా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని మోదీ తెలిపారు. ఎక్స్ అకౌంట్లో ఆయన మెసేజ్ చేశారు.