యూపీలోని హర్దోయ్లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాధేపూర్వా ప్రాంతానికి చెందిన ఆకాష్(32) తన భార్య కీర్తి (30) బీఏ పరీక్షలు ముగించుకుని ఇంటికి వస్తుండగా.. ఎర్టిగా కారు ముందు టైరు ఒక్కసారిగా పగిలింది. ఆకాష్100 కి పైగా స్పీడ్ తో ఉండడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వేప చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీ కొట్టిన వెంటనే మంటలు వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేక.. ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.