మాజీ సీఎం జగన్పై పల్నాడు ఎస్పీకి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రూ.6.7 కోట్ల ప్రజా ధనాన్ని సొంత అవసరాల కోసం వాడుకొని దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు. ఈ మేరకు ఎస్పీకి ఫిర్యాదు చేశానని, విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.