ఈ నెల 21న శ్రీనగర్ కు ప్రధాని మోదీ

61చూసినవారు
ఈ నెల 21న శ్రీనగర్ కు ప్రధాని మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్ లో పర్యటిస్తారని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. శ్రీనగర్ లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి దాదాపు 9000 మంది యోగా చేస్తారని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్లోని 20 జిల్లాల ప్రజలను వర్చువల్ గా కనెక్ట్ చేస్తామని, దాదాపు 50,000 మందికి పైగా ప్రజలు కశ్మీర్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్