తిరుపతిలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. జగన్మాత స్కూల్లో ఏర్పాటు చేసిన 96, 97 బూత్ లలో దొంగ ఓట్లు వేస్తూ ఐదుగురు పట్టుబడ్డారు. ఎపిక్ కార్డులు మార్చి దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లు పోలింగ్ ఏజెంట్లు గుర్తించారు. దొంగ ఓట్లు చేయడానికి వచ్చిన వ్యక్తులను జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు స్థానిక ఈసీ అధికారులకు, పోలీసులకు పట్టించారు.