మాజీ సీఎం జగన్కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సర్ప్రైజ్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఈవీఎంల వినియోగంపై నారాయణ స్పందించారు. ‘ప్రపంచవ్యాప్తంగా సుమారు 122 దేశాలు ఈవీఎంలు వినియోగించడం లేదన్నారు. అనేక దేశాలకు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. మనదేశంలో మాత్రం ఈవీఎంలపై చర్చకు వస్తున్న అనుమానాలు, ఆరోపణలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలు జరపాలి.’ అని జగన్ కామెంట్స్కు పాజిటివ్గా మాట్లాడారు.