సుప్రీంకోర్టులో నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేడు జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు.