BREAKING: జనసేన పార్టీకి భారీ ఊరట

57597చూసినవారు
BREAKING: జనసేన పార్టీకి భారీ ఊరట
గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి హైకోర్టులో జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. ఈ గుర్తును జనసేన పార్టీకి కేటాయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

సంబంధిత పోస్ట్