AP: నెల్లూరులోని బర్మా షెల్ గుంట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 6 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో దివ్యాంగురాలైన నాగలక్ష్మి(12) సజీవ దహనమైంది. 4 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.