వానాకాలం సాగుపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. పంటల సాగు, ఎరువుల నిల్వలు, సరఫరాపై అధికారులతో మాట్లాడారు. జూన్ 19 వరకు 17.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని మంత్రి వెల్లడించారు. అత్యధికంగా 15.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని, కంది పంట 76,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువులు పంపాలని కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు.