AP: రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవి కోసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.