అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని పాత అడగలి గ్రామంలో 34 నెంబర్ బూత్లో పోలింగ్ ఆగిపోయింది. మాక్ పోలింగ్ కంటిన్యూగా అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఇప్పటిదాకా 104 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అధికారులు మాక్ పోలింగ్ ను క్లియర్ చేయకుండా కొనసాగించడంతో 154 ఓట్లు అధికంగా పోల్ అయినట్లు గుర్తించారు. దీంతో 34 బూత్ లో పోలింగ్ నిలిచిపోయింది.