ఏపీలో ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. తాజాగా చిత్తూరు నియోజకవర్గం సంబంధించిన గుడిపాల మండలంలోని మండి కృష్ణాపురం పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకుడు చంద్ర.. వైసీపీ ఏజెంట్ సురేష్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ప్రమాదంలో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిని వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.