AP: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. "మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం." అని తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.