ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ఆటోను క్రాస్ చేసేందుకు యత్నించిన బైక్ను కారు ఢీకొట్టింది. ఆ బైక్ మరో బైక్ను ఢీకొంది. బైక్పై ఉన్న ఇద్దరు యువకులు గాల్లో ఎగిరి కింద పడ్డారు. మరో ఇద్దరు యువకులు పక్కనే ఉన్న మ్యాన్హోల్లో పడ్డారు. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన వారు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.