తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాతకోట పోలింగ్ బూత్లో పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీ,టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకున్నారు. ఇరువర్గాల కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.