ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారింది. ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలతో తలపడుతున్నాయి. సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. టీడీపీ, జనసేన తొలి జాబితాలో 99 మందిని ప్రకటించారు. రెండో జాబితాపై కసరత్తు జరుగుతోంది. కొందరు సీనియర్లకు సీట్లు దక్కటం అనుమానంగా కనిపిస్తోంది. దీంతో వారితో చంద్రబాబు మంతనాలు మొదలుపెట్టారు. పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు.