ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. బాంబు పెట్టిన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఆచూకీ తెలిపిన వారికి రూ. 10,00,000 రివార్డును ఇస్తామని NIA ప్రకటించింది. 080-29510900, 8904241100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని NIA వెల్లడించింది.