ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

54చూసినవారు
ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌ లక్నో జిల్లా కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోగల ఓ రెండంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లోని ఉన్న 5 మంది సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పటాకుల పేలడం వల్లే ముందుగా మంటలు చెలరేగి, ఆ తర్వాత సిలిండర్‌ పేలినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్