ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రాజమహేంద్రవరంలో దగ్గుబాటి పురందేశ్వరి (బీజేపీ), విజయవాడలో కేశినేని చిన్ని (టీడీపీ) ముందంజలో ఉన్నారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ), నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (టీడీపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విజయవాడలో అన్నాదమ్ముళ్లు కేశినేని నాని(వైసీపీ), చిన్ని(టీడీపీ) బరిలో ఉన్న విషయం తెలిసిందే.