AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. 80% పూర్తైన MLA, MLC క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదని.. భవనాలు బూజు పట్టిపోయాయని మండిపడ్డారు. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.